
పాలకొండ వెబ్ న్యూస్ : 30.10.2025 పాలకొండకు చెందిన బాసూరు శివశంకర ప్రసాద్
రూపొందించిన 'పాలకొండ టెంపుల్స్ బ్లాగ్'ను శ్రీ కోట దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణ
అధికారి (EO) వి. వి.
సూర్యనారాయణ ఈరోజు ఆలయ సన్నిధిలో లాంచనంగా ప్రారంభించారు. బ్లాగ్ లింకును క్లిక్
చేసి శ్రీ కోటదుర్గమ్మ వారి చరిత్ర విశేషాలను ఆయన ఆవిష్కరించారు. కార్యనిర్వహణ అధికారి సూర్యనారాయణ మాట్లాడుతూ, పాలకొండలోని అన్ని దేవాలయాలను ఒకే చోట చేర్చి, వాటి విశేషాలు, ప్రాధాన్యతలను ఇందులో పొందుపరచడం ద్వారా భక్తులు
ఎక్కడి నుండైనా ఆలయాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు
దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, పాలకొండలోని దేవాలయాల విశిష్టతను ఈ బ్లాగ్ ద్వారా
భక్త జనానికి తెలియజేయడం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జె. కామేశ్వర రావు, ప్రెస్ క్లబ్ కార్యవర్గం, ఆలయ జూనియర్ అసిస్టెంట్లు కె. పరమేశ్వరి, వేమకోటి శ్రీనివాస రావు, ప్రెస్ క్లబ్ కార్యవర్గం, సభ్యులు పాల్గొన్నారు.


0 Comments